న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన ఒక యాడ్ వివాదాస్పదంగా మారింది. జూన్ 1న ఏడో దశలో భాగంగా సిక్కులు అధికంగా ఉండే పంజాబ్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ముస్లింలకు వ్యతిరేకంగా సిక్కు మతస్తులను రెచ్చగొట్టేలా ఆ డిజిటల్ ప్రకటన ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి.
సిక్కులు, ఇతర కమ్యూనిటీల కంటే కాంగ్రెస్ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని యాడ్ వర్ణించింది.