వారణాసి: సాయంత్రం ఐదు దాటాక చీకట్లో మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లొద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్య పేర్కొన్నారు. ఒకవేళ స్టేషన్కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. తండ్రి, సోదరుడు లేదా భర్తతో కలిసి ఉదయంపూటనే వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లలో మహిళలకు భద్రత లేదని బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీ అన్నారు. మౌర్య చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.