లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో బీజేపీ సర్కార్ కొలువుతీరుతందని ఫలితాలు వెల్లడవుతుండటంతో కాషాయ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటన్నాయి. లక్నోలో ఆ పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలతో బుల్డోజర్లపైకి ఎక్కి వేడుకలు జరుపుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యానాధ్ ర్యాలీలకు హాజరైన ఆ పార్టీ శ్రేణులు బుల్డోజర్ బాబా జిందాబాద్ అని నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ఇక బుల్డోజర్ల పైకి ఎక్కిన బీజేపీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఇక అయోధ్యలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సీఎం యోగి ఆదిత్యానాధ్ను బుల్డోజర్ బాబా అంటూ ఎద్దేవా చేశారు.
ఇప్పటివరకూ యోగిని మనం బాబా సీఎం అని పిలుస్తుంటే ఇక నుంచి ఆయన పేరు బుల్డోజర్ బాబాగా మారిందని వ్యాఖ్యానించారు. అన్నింటి పేర్లను మార్చిన యూపీ సీఎం యోగి చివరకు ఆయన పేరు కూడా బుల్డోజర్ బాబాగా మార్చుకున్నారని సెటైర్లు విసిరారు.