లక్నో, జనవరి 19: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఇదివరకటి ఎన్నికల్లో బీజేపీని సమర్థిస్తే ఆ పార్టీ రైతులను రాజకీయాల కోసం వాడుకున్నదని బీకేయూ నేత నరేశ్ టికాయిత్ దుయ్యబట్టారు. ఈసారి రైతుల ఉద్యమం ప్రభావంతో యూపీలో బీజేపీ దెబ్బతినడం ఖాయమని అన్నారు. గతంలో బీజేపీని సమర్థించినందుకు బీకేయూ ప్రస్తుతం చింతిస్తున్నదని చెప్పారు. నిజానికి 2014 లోక్సభ ఎన్నికల్లో, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో, తిరిగి 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని సమర్థించిందని గుర్తు చేశారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ కాదని విమర్శించారు. రైతుల మద్దతును సొంత రాజకీయాలకు వాడుకున్నదని అన్నారు.