న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ప్రధాని మోదీని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యత, దాని స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం ఆయన ఆర్జేడీ నేత శరద్ యాదవ్తో సమావేశమయ్యారు.
అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. మతోన్మాద బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తిచేస్తూ దేశాన్ని విభజిస్తున్నదన్న శరద్ యాదవ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు రాహుల్ తెలిపారు. ‘ఈ సవాలును మనమంతా ఎదుర్కొంటున్నాం. దేశాన్ని మనం ఏకం చేయాలి. మళ్లీ సోదరభావం వైపు నడపాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.