Akhilesh Yadav : ప్రచారం సందర్భంగా కర పత్రాలను పంచుతూ.. బీజేపీ కరోనాను వ్యాప్తి చేస్తోందని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఆర్ ఎల్డీ అధ్యక్షుడు జయత్ చౌదరీ, అఖిలేశ్ యాదవ్ సంయుక్తంగా ముజఫర్నగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే అఖిలేశ్ పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీ వెంటనే దృష్టి సారించాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు.ఇలా కర పత్రాలను పంచడం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని కూడా బీజేపీ మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. ఈసీ ఇలాంటి వారిని ఆపాలని ఆయన కోరారు. యూపీలో నెగెటివ్ రాజకీయాలను ఆపేందుకు పోరాడుతున్నామని, వీటిని స్వస్తి పలకాలన్నదే తమ లక్ష్యమని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదని, వచ్చేసారి మంచి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. రైతు భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అఖిలేశ్ పేర్కొన్నారు. తాము గనక అధికారంలోకి వస్తే, నల్ల సాగు చట్టాలను అమలు చేయమని, కనీస మద్దతు ధర ప్రకారమే కొనుగోళ్లు చేస్తామని అఖిలేశ్ హామీ ఇచ్చారు. అలాగే రైతులకు 300 యూనిట్ల వరకూ విద్యుత్ను ఉచితంగానే ఇస్తామని అఖిలేశ్ పునరుద్ఘాటించారు.