న్యూఢిల్లీ : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశంగా ఉందని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో దేశ రాజ్యాంగంలో షరియా నిబంధనలు భాగమయ్యాయని త్రివేది వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రధానకార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదే దేశ పాలనా పగ్గాలు చేపట్టేముందు కాంగ్రెస్ హయాంలో మన దేశం పాక్షికంగా ముస్లిం దేశంగా మనగలిగిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సమాజంలో హిందువుల పట్ల కాంగ్రెస్ పార్టీ విద్వేషం వ్యాప్తి చేసిందని, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సల్మాన్ ఖుర్షీద్, రషీద్ అల్వి వ్యూహాత్మకంగా హిందువుల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేశారని మండిపడ్డారు. భారీ కుట్రలో భాగంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు దుష్ర్పచారం సాగిస్తున్నారని త్రివేది ఆరోపించారు.