న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగించారు.దీంతో నడ్డా ఈ ఏడాది జూన్ వరకు అంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జనవరిలో ఈ మేరకు చేసిన ప్రతిపాదనకు ఢిల్లీలో రెండ్రోజులుగా జరుగుతున్న బీజేపీ జాతీయ మండలి సమావేశం ఆదివారం ఆమోదం తెలిపింది. బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా 2020లో బాధ్యతలు చేపట్టారు.