జైపూర్ : నేరాలు, ఘోరాలు, అవినీతికి కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తుందని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ (Rajasthan Polls) విమర్శలు గుప్పించింది. పేపర్ లీక్స్, నేరగాళ్ల నైతిక స్ధైర్యం పెంచడం, మొఘల్ పాలనను ప్రశంసించడంపై కాంగ్రెస్ ప్రజలకు గ్యారంటీ ఇస్తుందని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఎద్దేవా చేశారు.
2018లో తాము అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లోనే రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఆపై మాట తప్పిందని ఆరోపించారు. రాజస్ధాన్లో రైతుల ఆత్మహత్యలు మామూలు విషయం అయిందని విమర్శించారు. శాంతి భద్రతలు క్షీణించాయని, ఇదే కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చే గ్యారంటీ అని త్రివేది పేర్కొన్నారు. మోదీ హామీ ఇస్తే నెరవేరుస్తారని ఇది తమ గ్యారంటీ అని ఆయన చెప్పుకొచ్చారు. రాజస్ధాన్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని త్రివేది ధీమా వ్యక్తం చేశారు.
డిసెంబర్ 25న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. 2018లో జరిగిన రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్ధానాలకు గాను కాంగ్రెస్ 99 స్ధానాలను కైవసం చేసుకోగా బీజేపీ కేవలం 73 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ల మద్దతుతో అశోక్ గెహ్లాట్ రాజస్ధాన్ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టారు.
Read More :