న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో యమున ఎక్స్ప్రెస్వేపై ఓ బస్ (Bus Catches Fire) మంటల్లో చిక్కుకుంది. ఛత్ పూజ జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి పలువురు ప్రయాణీకులు స్వస్దలాలకు బయలుదేరడంతో బస్ జనాలతో కిక్కిరిసిఉంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
గ్రేటర్ నోయిడాలో యమున ఎక్స్ప్రెస్ హైవేకు కేవలం వంద మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఘటనా ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కాగా బుధవారం ఉదయం మరో డబుల్ డెక్కర్ బస్ మంటల్లో చిక్కుకుంది. మరోవైపు న్యూఢిల్లీ నుంచి బీహర్లోని దర్భంగా వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. (Train on Fire) గమనించిన కొందరు ప్రయాణీకులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకు దూకారు.
ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోని స్లీపర్ కోచ్ నుంచి పొగలు రావడాన్ని సరాయ్ భూపత్ స్టేషన్ మాస్టర్ గమనించారు. వెంటనే లోకోపైలట్ను అలెర్ట్ చేసి రైలును ఆపించారు. ఆ కోచ్లో మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు కిందకు దూకారు.
Read More :
Watch: క్రాకర్స్ కాల్చుతున్న బాలుడి మీదుగా దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్