లక్నో: ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళ్తోంది. ఇప్పటికే లీడింగ్లో ఉంది ఆ పార్టీ. తాజా రిపోర్ట్ ప్రకారం 403 స్థానాలకు గాను.. కాషాయ పార్టీ 250 సీట్లలో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ కేవలం 202 మాత్రమే. ఖర్హల్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ నేత అఖిలేశ్ యాదవ్ లీడింగ్లో ఉన్నారు. గోరఖ్పూర్ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జశ్వంత్ నగర్ నుంచి శివపాల్ యాదవ్, డిప్యూటీ సీఎం కేశ్ ప్రసాద్ మౌర్యలు కూడా లీడింగ్లో ఉన్నారు. గడిచిన 30 ఏళ్లలో యూపీలో వరుసగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఇది రెండవ సారి అవుతుంది. ఇదో కొత్త రికార్డు కానున్నది.