న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు(Assembly Election Results) వెలుబడుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్లోనూ హోరాహోరీ పోరు సాగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో వందేసి సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. మధ్యప్రదేశ్లో 230, రాజస్థాన్లో 200 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు కావాలి. ఇక రాజస్థాన్లో 101 సీట్లు వచ్చిన పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. చత్తీస్ఘడ్లో 90 స్థానాల్లో కాంగ్రెస్ 43, బీజేపీ 37 స్థానాల్లో లీడింగ్లో ఉన్నది.