Yediyurappa on Modi | కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప వ్యాఖ్యలపై కేంద్రం.. కర్ణాటక బీజేపీ నాయకత్వం అప్సెట్ అయ్యాయి. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కేవలం మోదీ ప్రభంజనంతోనే గెలువలేమని ఆయన అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును మాత్రమే వాడుకుని ఎన్నికల్లో గెలువగలమని భ్రమలు పెట్టుకోవద్దని యెడియూరప్ప అన్నారని సమాచారం. మోదీ హవాపై మాత్రమే ఆధార పడొద్దన్నారని తెలిసింది.
అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రజల వద్దకు వెళ్లండి. బూత్ స్థాయి బృందాలు, అణగారిన వర్గాల్లోని పార్టీ కార్యకర్తలను విశ్వాసంలోకి తీసుకోవాలని యెడియూరప్ప సూచించారు. ప్రధానమంత్రి పేరిట లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడం తేలికే కానీ, త్వరలో జరిగే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో గెలుపొందడం నిజమైన పరీక్ష అని అభిప్రాయ పడ్డారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనడానికి సందేహాలు లేవు. కానీ అన్ని ఎన్నికల్లో గెలుపొందేలా పార్టీని బలోపేతం చేయాలి అని యెడియూరప్ప అభిప్రాయ పడ్డారు. ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ అధిష్ఠానం అప్సెట్ అయినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై వారే తుది నిర్ణయం తీసుకుంటారని ఆ వర్గాల కథనం.
మరోవైపు యెడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో తన తండ్రి పర్యటన ప్రణాళికకు పార్టీ బ్రేక్లు వేస్తుందా? అన్న ప్రశ్నపై విజయేంద్ర స్పందిస్తూ బ్రేకులన్నీ మా నాన్న చేతిలోనే ఉన్నాయి. ఆయన అవసరమని భావించినప్పుడు బ్రేక్లు వేస్తారు అని వ్యాఖ్యానించారు. సీఎంగా వైదొలిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై యెడియూరప్ప ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ప్రచారం.. రేవంత్పై కోర్టులో కేటీఆర్ పిటిషన్
#RahulDrugTest: రాహుల్ డ్రగ్టెస్ట్.. ట్విట్టర్లో ట్రెండింగ్
Stock markets: భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
న్యూ డుకాటి మాన్స్టర్ బుకింగ్స్ షురూ : ధర ఎంతంటే..!