చెన్నై, మార్చి 9: బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. దక్షిణాదిలో వలస కార్మికులపై దాడులు జరిగాయని ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా వదంతులు పుట్టిస్తున్నారని, తప్పుడు వీడియోలతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
దాడుల ఘటనపై వెంటనే ఆరా తీయగా, అది అబద్ధమని తేలిందని పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్తో మాట్లాడానని, వారంతా క్షేమంగా ఉన్నారని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.