మీరట్: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ నాయకుడొకరు తనకు కరోనా వైరస్ అస్సలే అంటుకోకూడదని అనుకున్నాడో, ఏమో! ఏకంగా ఐదు మోతాదుల (Vaccine Dose) కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆరోసారి కూడా డోసు కోసం వచ్చాడు. అయితే, అడ్డంగా దొరికిపోవడంతో తన తప్పిదాన్ని అధికారులపైకి నెట్టే ప్రయత్నం చేశాడు. దీనిపై విచారణ చేపట్టి నిజాలను నిగ్గుతేల్చుతామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేష్ మోహన్ పేర్కొన్నారు.
మీరట్కు చెందిన రాంపాల్ సింగ్ (73), సర్ధానా ప్రాంతంలోని 79 వ బూత్ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే, హిందూ యువవాహినిలో సభ్యుడిగా ఉన్నారు. ఇతగాడు ఇప్పటికే ఐదుసార్లు టీకాలు తీసుకున్నాడు. మరొక మోతాదు తీసుకునేందుకు షెడ్యూల్ చేయడంతో ఇప్పటికే ఐదుసార్లు టీకా తీసుకున్న విషయం బయటపడింది. ఇటీవల రాంపాల్ సింగ్ టీకా సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేయగా.. దానిలో ఐదుసార్లు టీకా తీసుకున్నట్లు నమోదైంది. తాను రెండు సార్లు మాత్రమే టీకాలు తీసుకున్నానని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఐదుసార్లు తీసుకున్నట్లు చూపిస్తున్నదని ఆరోపించారు. దాంతో దీనిపై విచారణకు ఆదేశించినట్లు వైద్యాధికారులు తెలపారు.
రాంపాల్ సింగ్ తన మొదటి టీకాను మార్చి 16 న, రెండవది మే 8 న తీసుకున్నాడు. అయితే, వ్యాక్సిన్ సర్టిఫికెట్ను అధికారిక పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇప్పటికే ఐదు టీకాలు తీసుకున్నాడని, 2021 డిసెంబర్ 2021- 2022 జనవరి మధ్య ఆరో షెడ్యూల్ను చూపించింది. సర్టిఫికేట్ ప్రకారం మొదటి డోస్ మార్చి 16 న, రెండోది మే 8 న, మూడోది మే 15 న, నాలుగు, ఐదోది సెప్టెంబర్ 15 న తీసుకున్నట్లు చూపుతుందని రాంపాల్ సింగ్ చెప్పారు. ఈ విషయంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేష్ మోహన్ స్పందించారు. వ్యాక్సిన్ కోసం ఎవరైనా ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదు చేసుకున్న మొదటి కేసు ఇదే కావచ్చునన్నారు. ఇది ముమ్మాటికి కుట్ర అని ఆరోపించారు.
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
పాకిస్తాన్లో రెపరెపలాడిన తాలిబాన్ జెండాలు.. చిక్కుల్లో ఇమ్రాన్ఖాన్
వివాదాల సుడిగుండంలో పంజాబ్ కొత్త సీఎం
ఢిల్లీలో పాగా వేసిన ఈస్ట్ఇండియా కంపెనీ
ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..