లక్నో, జనవరి 30: దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు హక్కులను, గౌరవాన్ని ఇవ్వడం ఇష్టం లేకనే కులగణన చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు.
పెట్టుబడిదారులు, ధనికులకు లాభం చేయడమే బీజేపీ విధానమని, పేదలు, మధ్యతరగతి ప్రజలు అసలు ఆ పార్టీ అజెండాలోనే లేరని అఖిలేశ్ విమర్శించారు.