ముంబై, నవంబర్ 28: మహారాష్ల్రలో తమ భాగస్వామ్య పక్షాలకు బీజేపీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలలో సీట్ల పంపకం గురించి కూటమి పార్టీలతో ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరకపోయినా 48 స్థానాల్లో 26 సీట్లలో తాము పోటీ చేస్తామని బీజేపీ చెబుతున్నది. మిగిలిన 22 సీట్లను శివసేన, ఎన్సీపీ పంచుకోవాలని పేర్కొంటున్నది. బీజేపీ, శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) మహాయుతి కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. సీట్ల పంపకంపై బీజేపీ మీద షిండే సేన, అజిత్ పవార్ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిపై శివసేన (షిండే వర్గం) మంత్రి ఒకరు మాట్లాడుతూ ‘మా సంకీర్ణంలో బీజేపీ పెద్ద పార్టీ అన్న విషయం ఒప్పుకుంటాం. అయితే మా సహాయంతోనే బీజేపీ అధికారం చేపట్టిందన్న విషయాన్ని మరచిపోకూడదు కదా’ అని ప్రశ్నించారు.