లక్నో: ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలకు బీజేపీ అంత్యక్రియలు నిర్వహించిందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ను (Akhilesh Yadav’s Video Attack) ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై ఈ మేరకు మండిపడ్డారు. ఘజియాబాద్ జిల్లాలోని ముస్సోరీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఒక పెళ్లి వేడుక జరిగింది. అయితే డీజే ప్లే చేసిన మ్యూజిక్పై వివాదం చెలరేగింది. ఇది కాస్త పెద్ద గొడవగా మారింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సుమారు 20 మందిపై కేసు నమోదు చేశారు. 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన అఖిలేష్ యాదవ్, పెళ్లిలో జరిగిన ఈ కోట్లాటకు సంబంధించిన వీడియో క్లిప్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన మండిపడ్డారు. ‘యూపీలో శాంతిభద్రతలకు బీజేపీ అంత్యక్రియలు నిర్వహించింది’ అని ఎద్దేవా చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్, ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరిని కొందరు దుండగలు శుక్రవారం పట్టపగలు ప్రయాగ్రాజ్లో కాల్చి చంపారు. దీనిని అసెంబ్లీలో శనివారం ప్రశ్నించిన అఖిలేష్ యాదవ్పై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఈ వీడియో క్లిప్తో కౌంటర్ ఇచ్చారు.
उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd
— Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023