కోజీకోడ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేరళ మాజీ సీఎం, సీపీఎం అగ్ర నేత పినరయి విజయన్ శనివారం విమర్శలు గుప్పించారు. ఆయన రాజకీయ వైఖరి ఇండియా కూటమిని బలోపేతం చేయడం లేదని, తరచూ అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చేకూరుస్తున్నదని అన్నారు. కేరళలో ఎన్నికల సందర్భంగా ఏర్పడిన రాజకీయ వైరం కారణంగా తాను విజయన్ను ఆలింగనం చేసుకోనని ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారా?
అనే దానిపై విజయన్ మాట్లాడుతూ ప్రస్తుతం డీఎంకే వైఖరి ఏమిటో మనమందరం చూశామన్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ వైఖరే కారణమని ఆయన ఆరోపించారు.