న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ బుధవారం పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాతో పాటు మరో తొమ్మిది సభ్యులతో ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బోర్డును ప్రకటించారు. నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్షా, జేపీనడ్డా, బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జాఠియా, బీఎల్ సంతోష్ను సభ్యులుగా నియమించింది.
ఇదిలా ఉండగా.. పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్కు ఉద్వాసన పలుకగా.. బీఎస్ యడ్యూరప్ప, బీఎల్ సంతోష్లకు బీజేపీ పార్లమెంట్ బోర్డులో అవకాశం కల్పించింది. అలాగే బీజేపీ 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు జేడీ నడ్డా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.