BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆకర్షితులపై మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. విదర్భకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు శుక్రవారం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు.
వార్ధా, నాగ్పూర్ జిల్లాల్లోని ఆర్వి, రాంటెక్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలు ఉన్నారు. వార్ధా జిల్లా అర్వి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వరాజ్ షెట్కారీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు జై కుమార్ శంకర్ బల్కెడే, బీజేపీ వార్ధా జిల్లా యువమోర్చా నేత, ఓబీసీ నాయకురాలు హర్షతాల్ జైకుమార్ బల్కెడే, యాదవరావ్ కేశవరావ్ బంగే, రాజ్ బౌవ్ షెట్కాడె, నిరంజన్ పాటిల్, రామచంద్ర బరంగె, సచిన పండరీ, దర్పణ్ టోక్సె, భోజరాజ్ కౌషి, రోషన్ కర్కూరె, గోపాల్ గిరాడే, మయూర్ థాక్రె, ఆశిష్ ఘండే, నౌషాద్ సౌదగర్, మంగళా అద్వికార్, మణేష్, ప్రశాంత్, యోగేష్, ఆశిష్, అక్షయ్ బోనె ఉన్నారు.
నాగ్పూర్ జిల్లా రాంటెక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాంటెక్ మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కార్మోరె, మాజీ కార్పోరేటర్ ఉమేశ్ మహాజన్, శైలేష్ పాఠక్, ప్రయాస్ టవాలె, నాందేడ్ జిల్లా కిన్వత్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సురేష్ రంగినేని, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేవ్ రావ్ గోన్వే, గిరిజన నాయకుడు నారాయణ రావు సిడెం, ఇంగోలి నియోజకవర్గం నుంచి సందీప్ వి నిక్కతే, కిన్వత్ నియోజకవర్గం గోత్ సర్పంచ్ రాజారామ్ కోవె, దేవిదాస్ మునేశ్వర్ ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో పలువురు మరాఠా నేతలు చేరారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, కొల్లాపూర్ లోక్సభ మాజీ జిల్లా కో ఆర్డినేటర్ యువరాజ్ ఆనంద్ రావు పాటిల్, చాంగడ్ టౌన్ కౌన్సిలర్, కొల్లాపూర్ మాజీ జెడ్పీ సభ్యులు ఆనంద్ బాలాసాహెబ్ హలందకర్, మాజీ ఎమ్మెల్యే శంకర్ కౌలకర్ కుమారుడు, విద్యావేత్త సుశీల్ కౌలకర్, బీజేపీ కాగల్ తాలూకా అధ్యక్షుడు సందీప్ కురులే, కర్వీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ తనేకర్, మహారాష్ట్ర రోజ్ ఘర్ పరిషత్ అధ్యక్షుడు, కౌలాపూర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ విక్రమ్ జరాగ్, కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ జిల్లా అధ్యక్షురాలు అంజలి జాదవ్, అధికార ప్రతినిధి రవీంద్ర కైరే ఉన్నారు.
తుల్జాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఎస్టీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్ నవగిరె, మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అశోక్ రావు పాటిల్, ఉస్మానాబాద్ జెడ్పీ సభ్యులు ప్రకాశ్ చౌహాన్, శివసేన పార్టీ తుల్జాపూర్ తాలూకా అధ్యక్షుడు కృష్ణ మోరే, వంచిట్ బహుజన ఆఘడి జిల్లా ఉపాధ్యక్షుడు అంకుష్ లోకాణ్డే ఉన్నారు.
పూణే జిల్లా నుంచి భీమా కారేగన్ – సిధానక్ మహార్ 12వ రాజవంశీకుడు మలింద్ ఇందమూర్, హ్యూమన్ రైట్స్ ఎగైనెస్ట్ కరప్షన్ సంస్థ అధ్యక్షుడు ఫిరోజ్ ఉమర్ కచ్చి షేక్, సామాజిక కార్యకర్త నంజీన్ శనాద్ సయ్యద్, గ్రామీణ వశహరి పర్యావరన్ సేవ భావి సంస్థ అధ్యక్షుడు విజయ్ విఠల్ రావు సూర్యవంశీ, వెస్ట్ మహారాష్ట్ర, ఖేడ్ తాలూకా (సతారా) షెట్కారి సంఘటన్ అధ్యక్షుడు శంకర్ రావు దుల్తారోయ్ గాడ్సే, సతారా తాలూకాకు చెందిన బాబా సాహెబ్ రాజారామ్ జాధవ్, కోరేగావ్ తాలూకా నుంచి సురేష్ రామచంద్ర షిండే, పఠాన్ తాలూకా నుంచి శివాజీ విష్ణు కోలేకర్, మగలసేదా తాలూకా నుంచి సిద్ రాం భానుదాస్ మెంబడే, వాయి తాలూకా నుంచి రంగారావు శంకర్ రావు ఫద్రారె, అఘడి షెట్కారి సంఘటన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంధ్య థాయ్ వసంత్ రావు ఇంగోలి పార్టీలో చేరారు.
యావత్మల్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నానాసాహెబ్ గడిబొలి, సతారా లోక్సభ నుంచి డాక్టర్ శంబాజీ శివాజీ సంక్పాల్, వాయి ఖండల్ అసెంబ్లీ నుంచి కిశోర్ జాదవ్, ప్రకాశ్ పవసే, కోరే గావ్ నుంచి శివాజీ షిండే, చంద్రకాంత్ నాందేవ్ జాదవ్, శివాజీ హిందు రావు షిండే, ఎన్సీపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు, 2019 ఎమ్మెల్యే గా పోటీచేసిన ఘన్ శ్యామ్ అన్నా షేలర్, యువ నాయకుడు ప్రశాంత్ షేలర్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో మహారాష్ట్ర సీనియర్ నేతలు మాణిక్ కదం, శంకరన్న డోన్గే తదితరులు పాల్గొన్నారు.