బెంగళూర్ : ఖజానాను నింపుకునేందుకు కర్నాటక ప్రభుత్వం ఆలయాల రాబడిపై కన్నేసిందని కాషాయ పార్టీ విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధార్మిక సంస్ధలు, దేవాదాయ (సవరణ) బిల్లును సభ ఆమోదం పొందిన క్రమంలో బీజేపీ సిద్ధరామయ్య సర్కార్ లక్ష్యంగా విరుచుకుపడింది. ఖాళీ ఖజానాను ఆలయ నిధులతో పూడ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోందని దుయ్యబట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ చర్యను మంత్రి రామలింగారెడ్డి సమర్ధించారు. రూ. 10 లక్షల ఆదాయం దాటిన ఆలయాల నుంచి నిధుల వసూలు సబబేనని అన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాల మెరుగుకోసం ఆలయాల ఆదాయం నుంచి కొంత మొత్తం ధార్మిక పరిషత్కు కేటాయించడం 2003 నుంచి జరుగుతున్నదేనని మంత్రి వివరించారు.
రూ. 5 లక్షల నుంచి రూ . 25 లక్షల మధ్య ఆదాయం ఉన్న ఆలయాల నుంచి ఐదు శాతం ఆదాయం ధార్మిక పరిషత్కు వెళుతుందని మంత్రి చెప్పారు. ఈ విధానం కొత్తదేం కాదని, 2003 నుంచి అమలవుతున్నదేనని తెలిపారు. రూ. 5 లక్షల కంటే తక్కు వ ఆదాయం ఉన్న 3000 సీ గ్రేడ్ ఆలయాల నుంచి ధార్మిక పరిషత్కు ఎలాంటి నిధులు వెళ్లవని వివరించారు.
Read More :
Niranjan Reddy | కాంగ్రెస్ గ్యారంటీల అమలు అర్రాజ్ పాటలా మారాయి : మాజీ మంత్రి నిరంజన్రెడ్డి