న్యూఢిల్లీ: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కేసు విచారణలో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను సీబీఐ విచారించింది. శనివారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో 8 గంటల పాటు విచారణ చేసింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, కూతురు మీసా భారతితో పాటు మరికొందరికి సీబీఐ ప్రత్యేక కోర్టు మార్చి 15న బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భూములను లంచంగా తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణల మీద ఈ కేసు నమోదైంది.