CM Nitish kumar | పాట్నా: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటవ్వాల్సిన అవసరం ఉన్నదని, లేదంటే దేశ చరిత్రనే బీజేపీ మార్చుతుందని బీహార్ సీఎం నితీశ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నది. లేదంటే దేశ చర్రితను బీజేపీ మార్చేస్తుంది. ప్రజలకు మంచి జరగాలన్నదే నా ఉద్దేశం. ఇందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ప్రతిపక్షాలను ఒక్కటి చేయటంలో వ్యక్తిగత రాజకీయ ఎజెండా ఏదీ లేదు’ అని అన్నారు.