రాయ్పూర్ : కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కులగణన చేపడుతుందని ఛత్తీస్ఘఢ్ సీఎం (Chhattisgarh Polls) భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన ట్విట్టర్ వేదికగా వాగ్ధానం చేశారు. రుణమాఫీతో రాష్ట్రంలోని 22 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
17.5 లక్షల మందికి ఇండ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ మేలు చేస్తామని పేర్కొన్నారు. ఇక ఛత్తీస్ఘఢ్లో అధికారం నిలుపుకునేందుకు పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని కాషాయ పార్టీ చెమటోడుస్తోంది. చత్తీస్ఘఢ్లో నవంబర్ 7, నవంబర్ 17న రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Festive Season | మార్కెట్లకు పండుగల జోష్.. డిసెంబర్ 31 నాటికి రూ.8.5లక్షల కోట్ల టర్నోవర్..!