భోపాల్, జూలై 17: భోపాల్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులోని ఓ బోగిలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. బ్యాటరీ బాక్స్ పగలడం వల్ల ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
కల్హార్ స్టేషన్ వద్ద ఆ స్టేషన్ మేనేజర్ మంటలను గమనించి అధికారులను అప్రమత్తం చేశారని… తదుపరి స్టేషన్లో బ్యాటరీ బాక్స్కు మరమ్మతులు చేశామని వెల్లడించారు. సమాచారం తెలిసిన వెంటనే కోచ్లోని 37 మంది ప్రయాణికులను వేరే బోగీలోకి తరలించామని.. ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. వందే భారత్ రైలులో ఈ తరహా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.