భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలి రిసెప్షన్లో ఓ చిత్రం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ మార్గదర్శకుడు ములాయం సింగ్ యాదవ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలి రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు వెళ్లారు. ములాయం సింగ్ యాదవ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. ఈ ఫొటోను కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘవాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడమే ఆలస్యం సమాజ్వాదీ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. సమాజ్వాదీ అనే పేరులో ఎస్ అంటే సంఘవాది అని అర్థమని కాంగ్రెస్ విమర్శించింది.