బెంగళూరు, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ పది లేన్ల రహదారిలో అప్పుడే గోతులు పడ్డాయి. కొన్ని చోట్ల కంకర తేలిపోయి గుంతలు పడ్డాయి. అనేక చోట్ల సర్వీసు రోడ్లు, బైపాస్ రోడ్లు, చిన్న వంతెనల నిర్మాణాలు పూర్తి కాలేదు.
శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావిడిగా ఈ రహదారిని ప్రారంభించారు. రోడ్డు నాణ్యతపై బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ మండిపడ్డారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వసూలు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాపసింహ రాజప్రాసాదం లాంటి ఇంటిని కట్టుకుంటున్నారని విమర్శించారు.