బెంగళూరు: భార్య సోదరుడైన బావమరిది పెళ్లైన తన చెల్లితో సంబంధం పెట్టుకోవడంపై బావ ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని హత్య చేశాడు. ఆ తర్వాత కారులో మృతదేహాన్ని ఉంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. (man kills brother-in-law) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బైరప్పనహళ్లి ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల శ్రీనివాస్, డాగ్ కెన్నెల్ నిర్వహిస్తున్నాడు. భార్య తమ్ముడైన 24 ఏళ్ల రంజిత్, పెళ్లైన తన చెల్లితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు శ్రీనివాస్ తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో వారి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.
కాగా, మార్చి 26న ఈ వివాదంపై మాట్లాడేందుకు బావమరిది రంజిత్ను బావ శ్రీనివాస్ పిలిచాడు. బన్నెరఘట్ట సమీపంలోని ఒక ప్రాంతానికి కారులో తీసుకెళ్లాడు. మాటల సందర్భంగా ఆగ్రహించిన శ్రీనివాస్ ఐరాన్ రాడ్తో రంజిత్ తలపై కొట్టి హత్య చేశాడు.
మరోవైపు శ్రీనివాస్ ఆ తర్వాత బావమరిది రంజిత్ మృతదేహాన్ని కారులో ఉంచాడు. నేరుగా బన్నెరఘట్ట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
woman finds Rs 10 crore in account | బ్యాంకు ఖాతాలో పది కోట్లు.. ఇది చూసి షాకైన మహిళ
Man Beheads Ice-Cream Seller | ఐస్క్రీం వ్యాపారి తల నరికిన వ్యక్తి.. తెగిన తలను ఇంటికి తీసుకెళ్లాడు