లక్నో: ఐస్క్రీం వ్యాపారి, ఒక వ్యక్తి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అతడి తల నరికాడు. తెగిన ఐస్క్రీం వ్యాపారి తలను ఇంటికి తీసుకెళ్లాడు. తాపీగా వంట చేసుకోసాగాడు. ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు. (Man Beheads Ice-Cream Seller) ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల ఐస్క్రీం విక్రేత బబ్లూ వాటిని అమ్మేందుకు శనివారం యథావిధిగా సైకిల్పై పర్సవాల్ గ్రామానికి వెళ్లాడు. స్థానికుడైన 50 ఏళ్ల శంకర్ యాదవ్, అతడి మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, ఆగ్రహించిన శంకర్ యాదవ్, ఐస్క్రీమ్ అమ్మే బబ్లూపై కొడవలితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా అతడి గొంతు కోసి తల వేరు చేశాడు. ఆ తర్వాత నరికిన బబ్లూ తలను చేతిలో పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. తాపీగా వంట చేసుకోవడం ప్రారంభించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐస్క్రీమ్ అమ్మే బబ్లూను హత్య చేసిన శంకర్ యాదవ్ ఇంటిని వారు చుట్టుముట్టారు. పోలీసులు ఇంటి లోపలకు వెళ్లి చూడగా నిందితుడు వంట చేస్తూ కనిపించాడు. అతడి పక్కనే నరికిన బబ్లూ తల ఉన్నది.
పోలీసులు వెంటనే శంకర్ యాదవ్ను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బబ్లూ మృతదేహం, తెగిన తలను పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హతుడు బాబ్లూకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
➡️आईसक्रीम बेचने गए 21 वर्षीय युवक बबलू की निर्मम हत्या,
➡️गाँव में शंकर यादव ने कहासूनी के बाद बाँके से गला काटकर बबलू की कर दी निर्मम हत्या,
➡️हत्या से क्षेत्र में दहशत,
➡️टिकैत नगर थाना क्षेत्र के परसावल गांव का पूरा मामला !#Barabanki @Barabankipolice @Uppolice pic.twitter.com/hUsyQmGRWm— Hindustan Express | हिन्दुस्तान एक्सप्रेस (@Hindustan_Expr) March 28, 2026
Also Read:
Watch: శోభాయాత్ర సందర్భంగా.. గాలిలోకి కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే
Watch: జీతం చెల్లించలేదని.. యజమాని కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన డంపర్ డ్రైవర్