బెంగళూరు: క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. భర్త తిట్టాడని భార్య, భార్య కాపురానికి రావడం లేదని భర్త, అత్తింటి వారు వేధిస్తున్నారంటూ కోడళ్లు, అప్పుల బాధలు పెరిగాయని కొందరు, అనారోగ్యం కుంగదీస్తున్నదని ఇంకొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ, ధైర్యంగా ఉండగలిగితే సమస్యలు వాటంతట అవే వస్తాయి, పోతాయి అనే సంగతి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు.
తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని తలంగట్టపుర ఏరియాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. భర్తతో గొడవ పెట్టుకుని చరిస్మా సింగ్ అనే 40 ఏండ్ల మహిళ.. వారు నివాసం ఉండే పూర్వ హైలాండ్ అపార్టుమంట్ 19వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.