ముంబై: బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగిని కుక్క కరిచింది. దీంతో అతడు ఒక్క డోస్ యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్నాడు. అయితే రేబిస్ సోకినట్లు భయాందోళన చెందాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. (bank staffer dies by suicide) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్యాణ్ ప్రాంతంలో నివసించే 30 ఏళ్ల ఆయుష్ విశ్వనాథ్ అమీన్ గత ఎనిమిది ఏళ్లుగా భారత్ బ్యాంక్ థానే బ్రాంచ్లో పనిచేస్తున్నాడు.
కాగా, కొన్ని రోజుల కిందట టిస్గావ్ నాకా ప్రాంతంలో ఆయుష్ కాలుపై కుక్క కరిచింది. ఈ నేపథ్యంలో అతడు ఒక డోసు యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ మాత్రమే తీసుకున్నాడు. అయితే తనకు రేబిస్ సోకినట్లు ఆందోళన చెందాడు.
మరోవైపు కొన్ని రోజులుగా ఆయుష్ ప్రవర్తనలో మార్పులను కుటుంబ సభ్యులు గమనించారు. అయితే ఫిబ్రవరి 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
woman throws daughter into river | కుమార్తెను నదిలోకి విసిరేసిన మహిళ.. ఆమె దూకబోగా కాపాడిన వ్యక్తి
Watch: చాలా దూరం కారును ఈడ్చుకెళ్లిన లారీ.. షాకింగ్ వీడియో వైరల్