ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్ర స్మరణతో ప్రముఖ బద్రీనాథ్ క్షేత్రం మార్మోగింది. గురువారం వేద, వాయిద్యాల నడుమ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.
చార్ధామ్ యాత్రలో భాగంగా ఇప్పటికే కేదార్నాథ్ ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. అయితే విపరీతంగా మంచు కురుస్తుండటంతో కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.