త్వరలో హల్దీవాగులోకి కొండపోచమ్మ సాగర్ జలాలు
రెండ్రోజుల్లో యావాపూర్లో పండుగను జరుపుకొందాం..
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
ఎండుతున్న పంటల పరిశీలన
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 4: కోటి ఎకరాల మాగానికి సాగునీటిని అందించి పంటపొలాలను సస్యశామలం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. రైతుల పంటపొలాలు ఎండిపోకుండా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. మరో రెండు రోజుల్లో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీవాగులోకి సాగునీరు అం దించేలా ప్రత్యేక చొరవ చూపిస్తానన్నారు. తూ ప్రాన్ మండలం యావాపూర్ చెక్డ్యాం పరిసరాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఎండిపోయిన చెక్ డ్యాం, పంట పొలాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీటిని అందించి పం టలు ఎండిపోకుండా చూడాలని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేండ్ల కాలం లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణ పనులను ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి సాగునీటిని రైతుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ కూడవెళ్లి వాగులోకి ఇటీవల విడుదల చేశామన్నారు. మండలంలోని యావాపూర్, కిష్టాపూర్ రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, మరో రెండు రోజుల్లో హల్దీవాగులోకి సాగునీటిని విడుదల చేయించేలా కృషి చేస్తానన్నారు.
జలకళను సంతరించుకోనున్న చెక్డ్యాంలు
హల్దీవాగులోని సాగునీటిని అందించడం ద్వారా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, వర్గల్, మర్కూ క్, మెదక్ జిల్లాలోని తూప్రాన్, వెల్దుర్తి, నర్సాపూర్ మండలాలతో పాటు సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. హల్దీవాగు పరీవాహక ప్రాంతంలోని 17 చెక్డ్యాంలు పొంగిపొర్లి ప్రవహిస్తాయని, తద్వారా వేలాది ఎకరాల బీడుభూములు సస్యశ్యామలమవుతాయన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, వర్గల్ మండలాల మీదుగా తూప్రాన్ మండలంలోని యావాపూర్, కిష్టాపూర్, బ్రాహ్మణపల్లి, నాగులపల్లి చెక్డ్యాంలు జలకళను సంతరించుకుంటాయన్నారు.
రైతేరాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతం
రైతే రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని, ఇందులో భాగంగానే ప్రాజెక్టుల నిర్మాణాలను చేపడుతుందన్నారు. కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే తునికి, ఖాన్ చెరువుల మీదుగా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్కు సాగునీరందుతుందన్నారు. తద్వారా రైతుల పంటపొలాలకు సాగునీరు పుష్కలంగా లభిస్తుందన్నారు. తూప్రాన్ మండలంలోని ఎండిపోతున్న పంటల గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, రెండు రోజుల్లోగా సాగునీటిని విడుదల చేయిస్తానని తెలిపారు. ఇక్కడే గ్రామస్తులమంతా పండుగను జరుపుకొందామని తెలిపారు. దీంతో రైతులు జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆయన వెంట తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, యావాపూర్ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ లక్ష్మీస్వామి, గ్రామాల సర్పంచ్లు, రైతులు ఉన్నారు.