భోపాల్ : మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులోని ‘గామిని’ చీతా ఆదివారం ఐదు కూనలకు జన్మనిచ్చింది. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘కునోలో ఐదు చక్కని కూనలు! దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఐదేండ్ల గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
వీటితో కలిపి ప్రస్తుతం కునో పార్కులో చీతాల సంఖ్య 26కు చేరిందన్నారు. భారత్లో పిల్లలను ఈనిన నాలుగో చీతా గామిని కాగా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చినవాటిలో మొదటిదని ఆయన చెప్పారు. చీతాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ కింద నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మొత్తం 20 చీతాల్ని భారత్కు తీసుకురాగా, ఇందులో అనేకం మృత్యువాత పడ్డాయి.