న్యూఢిల్లీ: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఇవాళ లోక్సభలో మాట్లాడారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్టపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబ్రీ మసీదు జిందాబాద్.. జిందాబాద్.. భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. 1992 డిసెంబర్ 16వ తేదీన జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతను పార్లమెంట్ ఖండించిందని గుర్తు చేశారు. ఆ ఘటన వల్ల వీహెచ్పీ లాంటి సంస్థలు వర్గ హింసకు పాల్పడ్డాయని ఆరోపించారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైన ఇద్దరు వ్యక్తులకు కేంద్ర సర్కారు భారత రత్న అవార్డులు ఇచ్చిందని ఓవైసీ ఆరోపించారు. ఇస్లామిక్ కట్టడాన్ని ధ్వంసం చేయడమే బాధాకరమని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పినట్లు ఓవైసీ గుర్తు చేశారు. సుప్రీం తన తీర్పులో అర్కియాలజీ సర్వే శాఖ ఇచ్చిన రిపోర్టును కొట్టివేసిందన్నారు. మసీదును నిర్మించేందుకు ఆలయాన్ని కూల్చలేదని ఓవైసీ అన్నారు.
ప్రధాని మోదీని ఓ ప్రశ్న వేయాలనుకుంటున్నానని, మోదీ ప్రభుత్వం కేవలం హిందువులకేనా లేదా యావత్ దేశానికా అని ఓవైసీ అన్నారు. డిసెంబర్ 6 ఘటన తర్వాత టాడా చట్టం కింద అరెస్టు అయిన యువకులు అందరూ వయసు మళ్లిన తర్వాత రిలీజైయ్యారని ఓవైసీ పేర్కొన్నారు. బాబ్రీ మసీదు జిందాబాద్.. భారత్ జిందాబాద్ అంటూ ఆయన అన్నారు.
#WATCH | During the discussion on the construction of the historic Ram Temple and Pran Pratishta begins in Lok Sabha, AIMIM MP Asaduddin Owaisi says “I want to ask if Modi Govt is the government of a particular community, religion or the government of the entire country? Does GoI… pic.twitter.com/cU6tS1WIxu
— ANI (@ANI) February 10, 2024