Ayodhya | దీపావళి వేడుకలకు (Diwali Celebrations) ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) నగరం ముస్తాబైంది. ఒకేసారి లక్షలాది దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు (World Record) సిద్ధమైంది. ఏటా దీపావళి పర్వదినానికి ముందు రోజు అయోధ్యలోని సరయూ నదీ తీరంలో (Saryu river bank) ‘దీపోత్సవ్’ (Deepotsav) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఏటాలానే ఈ ఏడు కూడా ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 51 ఘాట్లలో ఒకేసారి 25 లక్షల దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు.
శనివారం సాయంత్రం 6:30 గంటలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. సరయూ హారతి (Saryu Aarti) ఇస్తారు. అనంతరం నది ఒడ్డున దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొత్తం 25 వేల మంది వాలంటీర్లు ఒకేసారి 25 లక్షల దీపాలను వెలిగించనున్నారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ దీపాలను లెక్కించనున్నారు. ఈ దీపోత్సవానికి అన్ని శాఖల మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరుకానున్నారు. కార్యక్రమం అనంతరం లేజర్ షో ఏర్పాటు చేశారు.
#WATCH | Ayodhya is all set to hold a grand Deeptosav on the eve of Diwali with over 24 lakh diyas at 51 ghats set to illuminate the city pic.twitter.com/p4cEjJQiCd
— ANI (@ANI) November 11, 2023
#WATCH | Preparations underway at Ram ki Paidi in Ayodhya for Deepotsav 2023 pic.twitter.com/mFCgtHnBZz
— ANI (@ANI) November 11, 2023
#WATCH | Drone visuals of Deepotsav celebrations from Ayodhya, UP pic.twitter.com/0m6lwMJ6T8
— ANI (@ANI) November 11, 2023
Also Read..
Rashmika Mandanna | రష్మిక డీప్ఫేక్ వీడియో.. వివరాలు అందించాలంటూ మెటాకు ఢిల్లీ పోలీసుల లేఖ
Iceland | 14 గంటల్లో 800 భూ ప్రకంపనలు.. అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఐస్లాండ్
Manish Sisodia | కోర్టు అనుమతితో.. భార్యను చూసేందుకు జైలు నుంచి ఇంటికి వెళ్లిన సిసోడియా