Harihara Veera Mallu | దొరల్ని కొట్టి, పేదలకు పెట్టే రాబిన్హుడ్ తరహా పాత్రలో పవన్కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ‘ధర్మంకోసం యుద్ధం’ అనేది ఉపశీర్షిక. ఇది పవన్కల్యాణ్ నటిస్తున్న తొలి జానపద చిత్రం కావడం విశేషం. జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) దర్శకత్వంలో ఈ చిత్రం ఇప్పటికే 75శాతం పూర్తయింది. కాగా, మిగతా భాగాన్ని ఈ చిత్ర నిర్మాత ఏఏం రత్నం తనయుడు, దర్శకుడు అయిన జ్యోతికృష్ణ.. క్రిష్ పర్యవేక్షణలో పూర్తిచేయనున్నట్టు గురువారం టీజర్ విడుదల సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. పవన్కల్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నట్టు వారు తెలియజేశారు. తొలి భాగానికి చెందిన టీజర్ని గురువారం విడుదల చేశారు.
17వ శతాబ్దం నాటి కథగా రూపొందుతోన్న ఈ చిత్రం కోసం అప్పటి చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు.. వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో నిర్మించారు. వీరమల్లుగా పవన్కల్యాణ్ సాహసాలు ఈ సినిమాలో హైలైట్గా నిలువనున్నాయని టీజర్ చెప్పకనే చెబుతున్నది. టీజర్లోని బలమైన సంభాషణలు, అద్భుతమైన విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మొఘల్ చక్రవర్తిగా బాబీడియోల్ నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఈ చిత్రంలో నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా పతేహి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, వి.ఎస్.మనోజ్ పరమహంస, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.