Iceland | ద్వీప దేశం ఐస్లాండ్ (Iceland) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోతోంది. అక్కడ కేవలం 14 గంటల వ్యవధిలోనే ఏకంగా 800 సార్లు భూమి కంపించింది (800 Earthquakes Within 14 Hours). రెక్జానెస్ (Reykjanes) ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు శక్తివంతమైన భూకంపాలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.2 తీవ్రతగా నమోదైనట్లు ఐస్లాండ్ వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు ఈ ప్రకంపనలతో సమీపంలోని రహదారులు ధ్వంసమవడంతో.. రాకపోకలను అధికారులు మూసివేశారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకూ దాదాపుగా 800 సార్లు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.
వరుస భూకంపాలతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు (State Of Emergency). ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. అగ్నిపర్వత విస్ఫోటాలకు దారితీయోచ్చని ఐస్లాండ్ వాతావరణ విభాగం హెచ్చరించింది. భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతంలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్ ప్రాంతంలో ఏకంగా 24 వేల ప్రకంపనలు సంభవించాయి.
Also Read..
Manish Sisodia | కోర్టు అనుమతితో.. భార్యను చూసేందుకు జైలు నుంచి ఇంటికి వెళ్లిన సిసోడియా
Chandramohan | కె.విశ్వనాథ్, ఎస్పీబాలుతో చంద్రమోహన్కు ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?
Chandramohan | సంపాదించిన దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ.. చంద్రమోహన్ ఎమోషనల్ ఇంటర్వ్యూ