Gold Seize | గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad)లో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అహ్మదాబాద్లోని పాల్ది (Paldi) ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపు 100 కిలోలకుపైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్మగ్లింగ్ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో గల అవిష్కార్ అపార్ట్మెంట్ (Avishkar flat)లో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు రైడ్స్ చేసిన 107 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 88 కేజీలు బంగారు కడ్డీలు, 19.66 కిలలో ఆభరణాలు ఉన్నాయి. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్లో రూ.100 కోట్లకుపైమాటే అని అధికారుల అంచనా. బంగారంతోపాటు రూ.2 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Criminal Cases | దేశంలో 45 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. టాప్ ప్లేస్లో ఏపీ
PM Modi | భారత్ శక్తిని ప్రపంచం మొత్తం చూసింది.. కుంభమేళా విజయంపై ప్రధాని మోదీ
PM Modi | ట్రూత్ షోషల్లో చేరిన ప్రధాని మోదీ.. ట్రంప్తో ఉన్న పవర్ఫుల్ ఫొటోతో తొలి పోస్టు