Atishi : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్ధులు తలదాచుకునేందుకు రెండు కోట్ల ఇండ్లను బీజేపీ సమకూరుస్తుందా అని ఆమె ప్రశ్నించారు. వారికిచ్చేందుకు బీజేపీ వద్ద కోటిన్నర నుంచి రెండు కోట్ల ఇండ్లు ఏమైనా ఉన్నాయా అని ఆమె నిలదీశారు.
పేద నిర్వాసితులు ఉండేందుకు అవసరమైన స్ధలం లేకపోవడంతో వారంతా ముంబై, ఢిల్లీ, కోల్కతాల్లోని మురికివాడల్లో బతుకు వెళ్లదీయాల్సిన పరిస్ధితి నెలకొందని అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. శరణార్ధులకు ఉద్యోగాలు రాకుంటే వారు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అన్నారు.
బీజేపీ ఓటు బ్యాంక్ రాజకీయాలను అనుసరిస్తోందని ఆమె మండిపడ్డారు. చరిత్ర చూస్తే ఏ దేశం కూడా ఇతర దేశస్ధులకు తలుపులు తెరిచిన ఉదంతం కనిపించదని చెప్పారు. భారత్లో మాత్రం ఇలా జరుగుతోందని, వారిని భారత పౌరులుగా మార్చాలని బీజేపీ కోరుకుంటోందని, ఆ కోటిన్నర, రెండు కోట్ల మందిని తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకే ఇదంతా చేస్తున్నారా అని ఢిల్లీ మంత్రి కాషాయ పార్టీని ప్రశ్నించారు.
Read More :
Sai Priya Nagar | ముఖ్యమంత్రి గారూ మాకు ఉరి వేయండి.. సాయిప్రియ నగర్ కాలనీ బాధితులు..!