Mathura | కృష్ణాష్టమి వేళ ఉత్తరప్రదేశ్లో కలకలం చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వడలు తిన్న పలువురు అస్వస్థతకు (food poisoning) గురయ్యారు. వాంతులు, కడుపులో మంటతో ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన మథుర (Mathura)లో చోటు చేసుకుంది.
శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని (Janmashtami celebrations) పర్ఖామ్ గ్రామస్థులు స్థానిక దుకాణంలో బక్వీట్ (buckwheat) ఫ్లోర్ను కొనుగోలు చేశారు. ఆ పిండితో వడలు తయారు చేసుకొని తిన్నారు. వాటిని తిన్న వెంటనే చిన్నారులు, మహిళలు సహా సుమారు 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపులో మంటతో ఇబ్బంది పడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రుల్లో చేరారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
VIDEO | Uttar Pradesh: At least 50 people were taken ill after they consumed buckwheat (Kuttu) flour during Janmashtami celebrations in #Mathura.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/7fZcToSba0
— Press Trust of India (@PTI_News) August 27, 2024
Also Read..
Rahul Gandhi | మీ పెళ్లి ఎప్పుడు..? అంటూ విద్యార్థినుల ప్రశ్న.. రాహుల్ సమాధానం ఇదే
Klin Kaara | కృష్ణుడి పూజలో క్లీంకారా.. ఫొటో షేర్ చేసిన ఉపాసన
Vande Bharat | సిమెంట్ స్లాబ్ను ఢీ కొట్టిన వందే భారత్ రైలు.. తప్పిన ప్రమాదం