India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా వేలల్లో నమోదైన రోజూవారీ కేసులు.. తాజాగా వెయ్యికి దిగొచ్చాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 55,636 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 801 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,81,475కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 14,493 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,44,35,204 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 5,31,778కి ఎగబాకింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.03 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.78 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
Also Read..
spurious liquor | కల్తీ మద్యం తాగి 13 మంది మృతి.. 30 మందికి అస్వస్థత
Cyclone Mocha | బంగ్లా, మయన్మార్ను వణికిస్తోన్న మోచ తుఫాను.. అల్లకల్లోలంగా మారిన రెండు దేశాలు
Siddaramaiah | తదుపరి సీఎంపై ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య రహస్య సమావేశాలు..?