Ashok Chavan : దేశవ్యాప్తంగా బీజేపీకి పెరిగిన ఆదరణను గమనించే తాను కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ పార్టీలో చేరానని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్లో జరిగే విషయాల గురించి తాను మాట్లాడబోనని, తాను సోనియా గాంధీని గౌరవిస్తానని చెప్పారు.
తనను మహారాష్ట్ర నుంచి రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనను పెద్దల సభకు పంపాలని నిర్ణయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
తనపై నమ్మకముంచి బీజేపీ తనకు ఈ అవకాశం కట్టబెట్టడం గొప్ప విషయమని అన్నారు. తనపై ఉంచిన బాధ్యతను తాను నిజాయితీతో నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానని చవాన్ పేర్కొన్నారు.
Read More :
Congress Party | తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సీట్లు ఖరారు..