Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లోని హోషియార్పూర్లో ఆదివారం భారీ రోడ్షో నిర్వహించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను ప్రచారానికి ఇక్కడకు వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చానని ఆ హామీని ఇప్పుడు నెరవేర్చానని చెప్పారు. ఢిల్లీలో విద్యుత్ బిల్లులు జీరోకు తీసుకొచ్చామని, ఇక్కడ కూడా జీరో బిల్లులు ఇస్తామని భరోసా ఇచ్చి దాన్ని పకడ్బందీగా అమలు చేశామని గుర్తుచేశారు.
పంజాబ్లో మొహల్లా క్లినిక్స్ పనిచేస్తున్నాయని, గత రెండేండ్లుగా ఎన్నో సౌకర్యాలు, సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని, విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
AP News | స్కూల్ వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్