న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ కింద ఏర్పాటైన నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసుల అథారిటీ (ఎన్సీసీఏ) తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అథారిటీ ఎందుకూ కొరగానిదని పెదవివిరిచారు.
ఈ అథారిటీలో ఢిల్లీ సీఎంతో పాటు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శులు సభ్యులు కావడంతో ఏ ఉత్తర్వులనైనా మెజారిటీతో ఆమోదిస్తారని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై కేంద్రానికి అజమాయిషీ ఉండేలా జారీ చేసిన ఆర్డినెన్స్కు అనుగుణంగా ఇటీవల ఎన్సీసీఏ ఏర్పాటైంది. బ్యూరోక్రాట్లకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ అథారిటీకే సర్వాధికారాలను కట్టబెట్టారు. ఇక మంగళవారం జరిగిన ఎన్సీసీఏ తొలి భేటీలో తన శాఖలో అక్రమాలకు పాల్పడిన ఓ అధికారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
Read More :
Mangoes | కిలో రూ. 2.5 లక్షల విలువైన మామిడి పండ్ల చోరీ..!