భువనేశ్వర్ : ఒడిషాలోని నౌపడ జిల్లాలో ఓ ఫామ్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ. 2.5 లక్షలు పలికే మామిడి పండ్లను (Mangoes )దొంగిలించారు. తోట యజమాని పండ్ల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీనారాయణన్ అనే రైతు తన తోటలో 38 వెరైటీల మామిడి పండ్లను సాగుచేశాడు.
తన మామిడి రకాలకు మార్కెట్లో అత్యంత గిరాకీ ఉండటంతో ఉద్వేగానికి లోనైన ఔత్సాహిక రైతు ఈ విషయం సోషల్ మీడియాలో పంచుకోవాలని ఫొటోలను షేర్ చేశాడు. అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ఫొటోలను లక్ష్మీనారాయణన్ సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.
ఫొటో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే తన తోట నుంచి నాలుగు ఖరీదైన మామిడి పండ్లు చోరీ కావడంతో తోట యజమాని సహా స్ధానికులు విస్తుపోయారు. ఈ ఘటన వ్యవసాయ దిగుబడుల భద్రతపై ఆందోళన రేకెత్తించింది.
Read More :
Cool Drink | కోట్లు దోచిన దొంగలను పట్టించిన ఫ్రీ డ్రింక్