వడోదర : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ వ్యాప్తంగా ఆప్ ప్రచారం ప్రారంభించింది. వడోదరలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు.
అయితే ఆప్ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు చింపేయడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారని, అందుకే నిరసన వ్యక్తం చేస్తున్నామని బీజేపీ కార్యకర్తలు పేర్కొన్నారు. గుజరాత్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే ఆ పార్టీ కార్యకర్తలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆప్ లీడర్ దుర్గేశ్ పఠాక్ ట్వీట్ చేశారు.
ये गुंडागर्दी गुजरात में भाजपा की हार की बौखलाहट दर्शा रही है।#GujaratWithAAP pic.twitter.com/wBfyqVaP8S
— Durgesh Pathak (@ipathak25) October 8, 2022