Ayodhya : అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుతీరాడు. జై శ్రీరాం నినాదాలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ దివ్య ముహూర్తంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రతువును పూర్తి చేశారు.
ఈ సందర్భంగా శ్రీరాముడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలతోపాటు వెండి ఛత్రం, పాదుకలు అందించారు. ఇక సైనిక హెలికాఫ్టర్లలో అయోధ్య రామాలయంపై పూలవర్షం కురిపించారు. ప్రాణ ప్రతిష్ట వేడుకల సందర్భంగా హారతి ఇచ్చే సమయంలో రామాలయ ప్రాంగణంలో పలు భారతీయ సంగీత పరికరాలతో 30 మంది కళాకారులు ప్రదర్శన చేపట్టారు.
#WATCH | Indian Air Force (IAF) choppers shower flower petals over Shri Ram Janmaboomi Temple premises in Ayodhya as the idol of Ram Lalla is unveiled in the presence of Prime Minister Narendra Modi.
The air in the premises is filled with chants of ‘Jai Sri Ram’ by invitees who… pic.twitter.com/UsuBdQRCRz
— ANI (@ANI) January 22, 2024
అతిధులంతా మహా హారతి కార్యక్రమం ముగిసేవరకూ గంటలు మోగించారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితర ప్రముఖులు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read More :