న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ గత ఏడాది కెనడా(Canada)లో హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసుతో లింకున్న ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు వెల్లడించారు. నిజ్జార్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడ్డ విషయం తెలిసిందే. నిజ్జార్ మర్డర్ వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. కానీ ఆ ఆరోపణలను భారత్ ఖండించిన విషయం తెలిసిందే.
భారత్కు చెందిన కరణ్ బ్రార్, కమల్ప్రీత్ సింగ్, కరణ్ప్రీత్ సింగ్లను అరెస్టు చేశారు. ఆ ముగ్గురూ అల్బర్టాలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. వారిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. అనుమానితుల గురించి గతంలో తమకు తెలియదని, తొలి సారి ఈ కేసులో ఆ ముగ్గుర్ని విచారిస్తున్నామని, భారతీయ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని కెనడా పోలీసులు వెల్లడించారు.
ఇండియాలో వాంటెడ్ లిస్టులో ఉన్న ఉగ్రవాది నిజ్జార్ను 2023, జూన్ 18వ తేదీన కెనడాలోని సర్రేలో ఉన్న ఓ గురుద్వారా వద్ద హత్య చేశారు.